మన్యం టీవీ న్యూస్ : జూలూరుపాడు, జనవరి 1, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల ప్రజలకు వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త ఆశయాలు, కొత్త అవకాశాలు, సరికొత్త ఆనందాలతో ప్రజలందరి జీవితాలు నిండి పోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా స్థానిక సొసైటీ చైర్మన్ లేళ్ళ వెంకటరెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చౌడం నరసింహారావు మండల ప్రజలందరికీ వారి కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా మహమ్మారి కొత్త సంవత్సరంలో కనుమరుగు కావాలని, నూతన సంవత్సరంలో మండల ప్రజలందరికి మంచి జరగాలని కోరుకున్నారు.
Post A Comment: