గుండాల/ ఆళ్ల పల్లి జనవరి 6 మన్యం మనుగడ) రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం మనీ రైతుబంధు తో వ్యవసాయానికి సహాయం అని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు, ఆళ్ల పల్లి ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో దానితోపాటు మర్కోడు గ్రామంలోని రైతు వేదికలో రైతుబంధు సంబరాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ సంక్షేమ పథకాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దూసుకుపోతుందని రైతులను అన్ని రంగాలలో ఆదుకుంటున్న ఒకే ఒక్క రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం వారన్నారు. రైతుబంధు తో పెట్టుబడి సాయం అందించి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందుకునె ఒకే ఒక్క ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. రానున్న రోజుల్లో రైతు సంక్షేమానికి నిధులు కేటాయిస్తూ వారికి తోడ్పాటు గా నిలుస్తుందన్నారు. రైతుబంధు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు పెట్టి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మర్కోడు సర్పంచ్ శంకర్ బాబు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: