CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం.గ్రామగ్రామాన రైతు బంధు సంబరాలు.

Share it:

 


మన్యం మనుగడ, పినపాక:


  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట గ్రామ పంచాయతీలోని రైతు వేదిక వద్ద స్థానిక ప్రజాప్రతినిధులు రైతులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ,ముఖ్యమంత్రి కేసిఆర్ రైతులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని రైతు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని లక్ష్యంగా ముందుకు వెళుతున్నారని,రైతుల సంక్షేమం గురించి రైతు బంధు, రైతు బీమా 24 గంటల ఉచిత విద్యుత్ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ కు అన్ని వర్గాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుండగా రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ, ఆత్మ కమిటీ చైర్మన్ పొనుగోటి భద్రయ్య, సొసైటీ చైర్మన్ ముదునూరి రవి శేఖర్ వర్మ, స్థానిక సర్పంచ్ బాడిశ మహేష్ , ఉపసర్పంచ్ రాయల సత్యనారాయణ, టిఆర్ఎస్ పార్టీ నాయకులు దాట్ల వాసు బాబు, వార నరసింహారావు, గుండం దామోదర్, ధర్మారావు, వెల్లంకి నర్సింగ్ రావు ,వెల్లంకి అజయ్ బాబు , సురినేని ధర్మారావు, ముళ్లపూడి సత్యనారాయణ , ముళ్ళపూడి ప్రకాశం , గుండం దామోదర్ , గుండం లక్ష్మయ్య , అంజి బాబు, యాద శ్రీను ,వత్సవాయి సుబ్బరాజు, బద్దుల మాధవరావు, పాటిబండ్ల సత్యనారాయణ, రాయల సత్యనారాయణ ,బెడద శ్రీనివాసరావు , పోలవరపు రామకృష్ణ , నారాయణస్వామి, ఏ ఈ ఓ కేశవరావు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: