మన్యం మనుగడ, పినపాక:
రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని గాయాలపాలైన సంఘటన పినపాక మండలంలోని ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్ లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జానంపేట లోని తన ఇంటి నుండి బయ్యారం క్రాస్ రోడ్డు బయలుదేరిన సందీప్ అనే వ్యక్తి, మణుగూరు నుండి ఏడూళ్ల బయ్యారం గ్రామానికి వస్తున్న వంశీ అనే వ్యక్తులకు లకు సంబంధించిన ద్విచక్ర వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొనడంతో ఇద్దరికి గాయాలు కావడం జరిగింది. మెరుగైన చికిత్స కోసం ఇద్దరిని కొత్తగూడెం ఆసుపత్రికి తరలించడం జరిగింది.
Post A Comment: