మన్యం మనుగడ మంగపేట.
మంగపేట మండల కేంద్రంలో ఎర్రం గారి వీరన్ కుమార్ అధ్యక్షతన బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి సల్లూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో భారతదేశంలో అణగారిన వర్గాల ఆశాజ్యోతి నిరుపేదలకు మొట్ట మొదటి ఉపాధ్యాయురాలు గా మహిళ ల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించి వారి విద్యాభివృద్ధికి నిరంతరం కృషి చేసిన మహోన్నత మూర్తి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా పూలమాలలు వేసి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు గా బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి వేణు మరియు కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు నరేందర్ మండల ఉపాధ్యక్షులు అబ్బరా బోయిన లక్ష్మణ ప్రధాన కార్యదర్శి చిట్యాల రాజశేఖర్,దళిత మోర్చా మండల అధ్యక్షులు దుర్గం నరసింహారావు,బీజేవైఎం యూత్ సభ్యులు సాయి,అనిల్,సురేష్, నితిన్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: