- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు
మన్యం మనుగడ వెబ్ డెస్క్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం తహసిల్దార్ కార్యాలయంలో 20 మంది కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులకు,20 లక్షల రూపాయల విలువ చెక్కుల పంపిణీ చేసిన... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
దేశంలో ఎక్కడా లేని విధంగా మన సీఎం కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పథకాలు తీసుకువచ్చి ప్రతి కుటుంబానికి పెద్దన్న లాగా ఉన్నారని అన్నారు...
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంతో, 1,00,116/_రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నారు...
టిఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.
మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని అన్నారు.
మహిళల రక్షణ కోసం ఫి టీమ్స్, గర్భిణీలు, చిన్నారుల ఆరోగ్యం కోసం, ఆరోగ్య కళ్యాణ లక్ష్మి పథకం బాలింతల చిన్నారుల కోసం కెసిఆర్ కిట్టు లాంటి పథకాలను ప్రవేశపెట్టారు అని ఆయన గుర్తు చేశారు...
కళ్యాణ లక్ష్మి పథకం ఒక అద్భుతమైన పథకమని రాజకీయాలకతీతంగా ఈ పథకాన్ని అమలు చేసి రాష్ట్రంలోని ప్రజలతోనే కాకుండా ఇతర ప్రాంతాల ప్రజలతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రశంసలు పొందుతున్నదని అన్నారు...
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు.
సీఎం కేసీఆర్ దేశంలో లేనటువంటి అనేక పథకాలు మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారని, రైతులకు 24 గంటల కరెంటు , రైతు బంధు, రైతు బీమా, గొల్ల కురుమల గొర్రెల పంపిణి మొదలైన అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు...
ఈ కార్యక్రమంలో
బూర్గంపాడు జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత,మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సోషల్ మీడియా సభ్యులు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: