గుండాల /ఆళ్లపల్లి జనవరి 29 (మన్యం మనుగడ) పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య ను ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాలనుసారం ఆళ్ల పల్లి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు మరియు నాయకులు మణుగూరు మండలం లోని ఆయన స్వగ్రామమైన కూనవరం వెళ్లి సన్మానించారు. అనంతరం నరసింహారావు మాట్లాడుతూ ఆది ముఖ్యమైన రామచంద్రయ్య కు పద్మశ్రీ రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బాబా, కోపరేటివ్ చైర్మన్ రామయ్య , ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, మైనార్టీ నాయకులు ఎండి ఆదాం, నియోజకవర్గ యువజన విభాగం కార్యదర్శి ఆరిఫ్, టిఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి ఖయ్యుం, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: