CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పినపాక నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం:జడ్పీటీసీ పొశం.నర్సింహారావు.ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం.

Share it:

 





  • ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం పై హర్షం వ్యక్తం చేసిన ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు


మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు మణుగూరు జడ్పీటీసీ పోశం నరసింహారావు అధ్యక్షతన పినపాక నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మణుగూరు జడ్పిటిసి పోశం నరసింహారావు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుండి *ఇంగ్లీష్ మీడియం* ప్రవేశపెట్టాలని,ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురావాలని, క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి *కేసీఆర్* కీలక నిర్ణయం తీసుకోవటం సంతోషకరమైన విషయమని, అన్నారు.ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు విద్యారంగంలో సమూలమైన మార్పులు చేశారని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను బలోపేతం చేశారన్నారు.తెలంగాణ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పటిష్ట పరిచేందుకు,ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం అదేవిధంగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులపై చట్టం తీసుకురావటం వల్ల ప్రభుత్వ విద్య మరింత బలోపేతం అవుతుందని, ఆయన తెలిపారు.ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో మరియు బీ.సి,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ,గురుకులాల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ప్రైవేట్ విద్యా సంస్థల నుండి విద్యార్థులు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేరుతున్నారని, ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు పెద్ద ఎత్తున లాభం చేకూరుతుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం వల్ల ప్రైవేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్య అందుబాటులోకి రానుందని, తెలిపారు.ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల విద్యార్థులు,వారి తల్లితండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అన్నారు.సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్న సందర్భంగా ఫిబ్రవరి 1వ తేదీన నాడు స్కూలు ప్రారంభం కానున్న నేపథ్యంలో,టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల లో గులాబీ కలర్ బెలూన్లతో అన్ని ప్రభుత్వ పాఠశాల ఎదుట ఎగుర వెయ్యాలని పిలుపునిచ్చారు. టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా రేగా కాంతారావు తీర్మానాన్ని జెడ్పిటిసి పోశం నరసింహారావు ఈ సమావేశం లో ప్రవేశపెట్టారు.టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా రేగా కాంతారావు ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ను టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సీఎం కేసీఆర్ నియమించడం పట్ల పినపాక నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం లో పినపాక నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ అన్ని మండల మండల అధ్యక్షుడు లు,ప్రధాన కార్యదర్శులు,జడ్పీటీసీలు, ఎంపీపీలు,ఆత్మ కమిటీ చైర్మన్, సోసైటీ చైర్మన్ లు,రైతుబంధు కన్వీనర్ లు,పార్టీ సీనియర్ నాయకులు,పార్టీ ముఖ్య నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: