మన్యం టీవీ, భూర్గంపాడు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, కూనవరం గ్రామానికి చెందిన సకిని.రామచంద్రయ్య ఆదివాసీ ముద్దు బిడ్డ ను కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మ శ్రీ అవార్డు కు ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, భుర్గంపాడు మండల ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు సకిని.రామచంద్రయ్య ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఓకల్,ఫోక్ కళాకారుడు గా రామ చంద్రయ్య ఎంపిక కావడం చాలా సంతోషమని, ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.అనంతరం సకిని.రామచంద్రయ్య దంపతులను ను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సకిని.రామచంద్రయ్య మాట్లాడుతూ,ఇంత గొప్ప పురస్కారానికి నన్ను ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఈ సందర్భంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వల కు ఆయన ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత,మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యాలమ్మ, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాస రావు,వైస్ చైర్మన్ ఆవుల నాగిరెడ్డి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ డైరెక్టర్ సకిని బాబురావు,టిఆర్ఎస్ పార్టీ నాయకులు బెల్లంకొండ. రామారావు,జక్కం.సుబ్రమణ్యం,కొనకంచి.శ్రీనివాస్, జలగం.జగదీష్,ఉద్యమ నాయకులు పోడియం.నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: