గుండాల జనవరి29 (మన్యం మనుగడ) ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకు గుండాల ప్రాథమిక వైద్యశాల సమస్యలపై వినతి పత్రాన్ని గుండాల ఎంపీటీసీ ఎస్.కె సంధాని ఇచ్చారు. ఆ వినతి పత్రం ప్రాథమిక వైద్య శాల కు అదనంగా మహిళా డాక్టర్ ను నియమించాలని కోరారు. దీనితోపాటు కాన్పు కోసం వచ్చే మహిళలకు వేచి ఉండటం కోసం అదనపు గది కావాలని ఎక్స్ రే లేకపోవడం వలన వంద కిలోమీటర్ల వెళ్లి తీసుకోవాల్సి వస్తుంది అన్నారు ఆ సౌకర్యాన్ని కూడా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వైద్యశాలను 25 పడకల ఆసుపత్రిగా మార్చాలని విజ్ఞప్తి చేశారు
Post A Comment: