మన్యం న్యూస్,ములకలపల్లి:
ఎలాంటి భూమి లేకుండా రెక్కల కష్టం పై ఆధారపడి జీవిస్తున్న రోజు కూలీ కార్మికుల కు రైతు బంధు. దళిత బంధు ఇచ్చి ప్రజలని రైతులను ఆదుకోవాలని కూలీ బందు తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలని కోరుతూ సీపీఐ అనుబంధ సంఘం బీకే ఎం యూ. ఆధ్వర్యంలో ముల్కలపల్లి తహసీల్దార్ కు వినతిపత్రాన్ని అందచేశారు.
ఈ సందర్భంగా సీపీఐ మండల సహాయ కార్యదర్శి నరాటి రమేష్, బీ కే ఎం యూ మండల కార్యదర్శి కీసరి గంగరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో 1కోటి 40 లక్షల మంది పేదలు ఎలాంటి రక్షణ లేకుండా రెక్కల కష్టం నమ్ముకొని జీవిస్తున్నారు అని ఉండటానికి ఇల్లు .బట్ట లేకుండా జీవిస్తున్నారు అని ఇలాంటి దుర్భర జీవితాలు తో ఉన్న తెలంగాణ బిడ్డలు ను కూలి బందు ఇచ్చి ఆదుకోవాలని కొరినారు.
55 ఏళ్ళు దాటిన రైతు కూలీలకు 5వేలు పెన్షన్ ఇవ్వాలి అని .డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రభుత్వం కట్టి ఇవ్వాలని. .భూమిలేని పేదలకు 2ఎకరాలు భూమి ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలోఆ సంఘం నాయకులు అనుముల సాయి. నల్లి బాబు. శ్రీను. వీరు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: