మన్యం మనుగడ,గుండాల:
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండుకు పంపినందుకు గాను రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ గుండాల మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 10 గంటలనుండి 12 గంటల వరకు నల్లబ్యాడ్జీలు ధరించిగుండాల లో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బిజెపి మండల ప్రెసిడెంట్ఈసం ఉదయ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న భాజపా నాయకుల పై కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టడం సమంజసం కాదని ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తే మనం ప్రజాస్వామ్య పాలన లో ఉన్నామా అరాచక పాలన లో ఉన్నామని ఆలోచించాల్సిన పరిస్థితి ఉందని ఇది ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు అదేవిధంగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో నిర్వహించాలని ఆదేశించడం కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించడం కాదా అని ప్రశ్నించారు తక్షణమే ఈ ప్రభుత్వం బండి సంజయ్ కుమార్ గారి మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేసి వెంటనే వారిని విడుదల చేయాలని ఉద్యోగస్తులకు ఇబ్బందిగా ఉన్నా 317 జీవోను సవరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోOBC మండల అధ్యక్షులు
దడిగలరమేష్ మండల నాయకులు సొలమ్ సతీష్ మహేష్ వంశీ రవీందర్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: