మన్యం వెబ్ డెస్క్:
నిత్యం విద్యార్థుల సమస్యలపై స్పందించి ఉద్యమించే విద్యార్థి సంఘ నాయకుల పట్ల,విద్యార్థి సంఘాల పట్ల దురుసుగా ప్రవర్తించడం,బెదిరింపులకు పాల్పడడం నీతిమాలిన చర్య అని PDSU భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కాంపాటి పృద్వి, AISF జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ గౌడ్ PDSU భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి విరాట్ ,బోడు యూత్ నాయకులు ఎట్టి ప్రశాంత్ అన్నారు. ఈరోజు టేకులపల్లి మండల కేంద్రంలో విద్యార్థి సంఘాల ముఖ్యుల సమావేశం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టేకులపల్లి మండలం బోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినిల పై అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడి సస్పెండ్ విషయంపై స్పందించి పాఠశాలకు వెళ్లిన విద్యార్థి సంఘ నాయకులు పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామ పెద్దలు,విద్యార్థుల తల్లిదండ్రుల తో మాట్లాడుతున్న సందర్భంలో హఠాత్తుగా స్కూల్ ఎస్ఎంసి చైర్మన్ పోతుగంటి వీరభద్రం మరియు తన అనుచరులతో కలిసి విద్యార్థి సంఘాల పై విరుచుకుపడి దురుసుగా మాట్లాడుతూ విద్యార్థి సంఘాలు పాఠశాలకు రావొద్దని బెదిరింపులకు పాల్పడ్డారని దీనిని అఖిలపక్ష విద్యార్థి సంఘాలు గా వ్యతిరేకిస్తున్నామని వారు తెలిపారు. స్కూల్ మేనేజ్మెంట్ చైర్మన్ వ్యవహరించిన తీరుపై అఖిలపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో (రేపు) నేడు అన్ని రాజకీయ పార్టీలు,ప్రజా,కుల సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు.
Post A Comment: