CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నాగ రామకృష్ణ కుటుంబ సభ్యుల మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి.సూసైడ్ నోట్ ఆధారంగా వనామా రాఘవ, మరో ఇద్దరిని తక్షణమే అరెస్టు చేయాలి..

Share it:


  •  భాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి 
  • -విలేకర్ల సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయకార్యదర్శి కూనంనేని


పాల్వంచ : పాల్వంచ పట్టణంలోని పాత పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ కుటుంబ సభ్యుల మృతికి కారకుడైన వననా రాఘవ, మరో ఇరువురు నిందితులను అరెస్టు చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యాదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. పాత పాల్వంచలోని మృతుల నివాసంవద్ద మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఎలాంటి సంఘటనలపై పోలీసు శాఖ ఉదాసీనంగా వ్యవహరించడంవల్లే సంఘటన పునరావృతం అయిందని, ముగ్గురు బలయ్యారని, మరో అమ్మాయి మృత్యువుతో పోరాడుతుందన్నారు. చికిత్స పొందుతున్న రామకృష్ణ కూతురుకు మెరుజిన వైద్యం అందించాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. నిందితులను కాపాడే చర్యలు మానుకొని తక్షణమే అరెస్టుచేసి కఠినంగా శిక్షించి పోలీసు, న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని కలిగించాలసిన భాద్యత ప్రభుత్వంపై ఉందన్నారు. విలేకర్ల సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి SK. సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం, పాల్వంచ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచందర్ రావు, జిల్లా సమితి సభ్యులు బండి నాగేశ్వర్ రావు, నాయకులు అన్నారపు వెంకటేశ్వర్లు, గుండాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: