మన్యం టీవి, చర్ల ప్రతినిధి:
ములుగు జిల్లా వెంకటాపురం మండలం, కొండపూరం గ్రామంలో తాగిన మైకంలో భార్యని,అత్తని, బార్య అమ్మమని నరికిన భర్త. కుటుంబ కలహాలతో దుర్గం చంటి అతని బార్య లోకేశ్వరినీ, బార్య అమ్మ సమ్మక్కని, బార్య అమ్మమ్మని చికెన్ కొట్టే కత్తితో నరకడంతో అక్కడికక్కడే చనిపోయినా ముసలమ్మ, మిగిలిన వారిని ని వెంకటాపురం ప్రాథమిక కేంద్రంలో భార్య మరియు అతని అత్తయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కుటుంబ కలహాలతో తాగి వచ్చి క్రూరంగా గొడ్డలితో నరికినాడు. నరికిన వ్యక్తి ని గ్రామస్తులు అందరూ కలిసి చెట్టుకు కట్టేశారు.తన బార్య చెల్లిని తనకిచ్చి పెళ్లి చేయాలని వేదించడంతో తిరస్కరించిన బార్య ను మరియు కుటుంబ సభ్యులను అతి కిరాతకంగా నడిచినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Post A Comment: