మన్యం టీవీ కరకగూడెం: క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక ధారుడ్యానికి ఎంతగానో ఉపయోగ పడతాయని సామాజిక నేత నవీన్ బాబు అన్నారు.
కరకగూడెం మండలంలో తాటిగూడెం అదివాసీ యువసేన ఆధ్వర్యంలో సంక్రాంత్రి పర్వదిన సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం,ములుగు రెండు జిల్లాల స్థాయి నిర్వహణ భాగంగా క్రీడాకారులను పరిచయం చేసుకొని,తాటిగూడెం,గొల్లగూడెం,గ్రామాల జట్టుకు సామాజిక నేత నవీన్ బాబు జెర్సీలు వితరణ చేసి,కరకగూడెం ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ చేతుల మీదగా ఆవిష్కరణ చేశారు.మారుమూల గ్రామమైన తాటిగూడెం గ్రామంలో జిల్లాల స్థాయి క్రీడ పోటీలు నిర్వహించటం గొప్ప విషయం అన్నారు.
అనంతరం జెర్సీలు వితరణ చేసినందుకు నవీన్ బాబును టోర్నమెంట్ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కొమరం విశ్వనాథం,ఉప సర్పంచ్ జాడి నాగరాజు,వార్డు సభ్యులు గాందర్ల సతీష్ కుమార్,టోర్నమెంట్ నిర్వాహకులు కొమరం కాంతారావు,పోలెబోయిన లక్ష్మినారాయణ,కొమరం అనిల్,కొమరం రంజిత్,సత్యనారాయణ,సర్వేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: