మన్యంటీవి, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, కోయ రంగాపురం గ్రామ పంచాయతీ అయినా రమణక్కపేట గ్రామంలో 15 నిరుపేద ఆదివాసీ కుటుంబాలకు దుప్పట్లు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేసిన ఆదివాసి యువ నాయకులు అరేం ప్రశాంత్, కాకా శివశంకర ప్రసాద్, తాటి సాయి లక్ష్మణ్ లు. ఈ సందర్భంగా ఆదివాసి యువ నాయకులు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ గ్రామంలో కనీసం త్రాగడానికి మంచినీళ్ల బోరింగ్ పంపు కూడా లేకపోవడం వల్ల మూడు కిలోమీటర్ల దూరంలో మంచినీళ్లు తెచ్చుకొని త్రాగుతూ ఇబ్బంది పడుతున్నామని వారికి తెలియజేశారు. ఈ యొక్క సమస్యను స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు దృష్టికి మరియు ప్రజా ప్రతినిధులు తెలియజేసే సమస్య పరిష్కరిస్తామని యువ నాయకులు హామీ ఇచ్చారు.
Post A Comment: