మన్యం టీవీ మణుగూరు:
టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మున్సిపాలిటీ లోని 22 వార్డులలో ప్రతి ఇంటి ముందు ముగ్గులు వేసి రైతుబంధు సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసిందన్నారు.ఇంటింటా రైతులు రైతు బంధు సంబరాలు నిర్వహిస్తున్నారు అని,పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు తెలిపారు.దేశంలో ఎక్కడా లేని విధంగా 50 వేల కోట్ల రూపాయలు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న ప్రభుత్వం,తెరాస ప్రభుత్వం అని పేర్కొన్నారు.రైతుబంధు పథకం ద్వారా 50 వేల కోట్ల రూపాయలు రైతులకు పెట్టుబడి సహాయం గా అందిస్తున్న,సందర్భంగా వారోత్సవాలు నిర్వహించుకుంటూ ఉన్నామన్నారు.
Post A Comment: