మన్యం టీవీ కరకగూడెం: బిజెపి పార్టీ సీనియర్ నాయకులు కరకగూడెం మండలం మాజీ అధ్యక్షులు బైరిశెట్టి చిరంజీవి, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు ఖమ్రు, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు ఎస్ కె యాకుబ్ ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ రేగా వారిని పార్టీ కండువాకప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అందులో భాగంగానే అనేక రకాల సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందని ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. అనంతరం ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ పేద ప్రజల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని బడుగు బలహీన వర్గాల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాటిని అమలు చేస్తున్నారని ప్రజలకు సీఎం ఎం కేసీఆర్ పై పూర్తిగా నమ్మకం భరోసా కలిగిందని అన్నారు. ప్రతిరోజు రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పరిపాలన చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు అని అన్నారు. అలాగే పినపాక నియోజకవర్గం ప్రజలకు సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ కొమరం రాంబాబు మండల అధ్యక్షులు రావుల సోమయ్య కరకగూడెం ఉపసర్పంచ్ రావుల రవి పార్టీ నాయకులు రేగా సత్యనారాయణ, సారా సాంబయ్య, అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి, బుడగం రాము, కొంపల్లి పెద్ద రామలింగం, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: