- భూ వివాదాలకు నాకు ఎలాంటి సంబంధం లేదు
- మళ్లీ గెలుపు రేగా ది అని సర్వే లో తెలియగానే కొందరు బురద జల్లే యత్నాలు
- సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసిన విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు
మన్యం టీవి న్యూస్:పినపాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజల మనసు గెలుచుకోన్నోడిని విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు.తనకు మంచి పేరు రావడం గిట్టని కొందరు ఉదేశ్య పూర్వకంగా తమపై తప్పుడు ఆరోపణలు చెయ్యడం జరుగుతుంది అని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.నా లక్ష్యం ముందు మీ చిల్లర ఆరోపణలు పారవని...అలంటి వారికి చిప్ప చేతికి వస్తుందని రేగా మండి పడ్డారు.మణుగూరు మండలం జరుగుతున్న భూ వివాదాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని,ప్రజలు ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మొద్దని ఆయన కోరారు.
Post A Comment: