మన్యం మనుగడ, మణుగూరు:తాటి చెట్టు పై నుండి పడి గీత కార్మికునికి తీవ్ర గాయాలపాలైన సంఘటన రామచంద్రపురం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
అశ్వాపురం మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన కొండ బక్కయ్యగౌడ్ దురదృష్టవశాత్తు తాటిచెట్టు పైనుండి జారీ కింద పడడ్డాడు. ఈ క్రమంలో రెండు కాళ్ళు విరగడం తో పాటు వెన్నుపూస దెబ్బతినడం జరిగింది.క్షతగాత్రున్ని భద్రాచలంలో లోని ఆస్పత్రిలో చేర్పించారు. బాధిత కుటుంబం కడు పేదవారు.వైద్య ఖర్చులకు గాను రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ నుండి రూ.5వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో మణుగూరు గౌడ్స్ సంఘం అధ్యక్షులు తాళ్లపల్లి యదగిరిగౌడ్, ఉపాధ్యక్షులు పొడిసెటైరములుగౌడ్, కొండ వీరయ్యగౌడ్.సెక్రెటర్.గంగరాజుగౌడ్.కంట్లమయ్యగౌడ్.పొడిశెట్టివెంకన్న.చీకటి దామోదర్ గౌడ్.మేకపోతుల సంబశివగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: