మన్యం మనుగడ ఏటూరు నాగారం
ఏజెన్సీ మండలాలైన ఏటూరు నాగారం,మంగపేట, కన్నాయిగూడెం,వాజేడు, వెంకటాపురం మండలాలలో ఆదివాసి సొసైటీలకు కేటాయించిన ఇసుక క్వారీలను రైజింగ్ కాంట్రాక్టర్లకు ఇవ్వడం వల్ల ఆదివాసీలు నష్టపోతున్నారని,ఒక క్యూబిక్ మీటర్ కు రెండు వందల ఇరవై రూపాయలు ఇవ్వడం జరుగుతుందని రేసింగ్ కాంట్రాక్టర్ వల్ల ఆదివాసీలకు 40 రూపాయలు,కాంట్రాక్టర్లకు 180 రూపాయలు ఇవ్వడంతో ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు.ఈ విధానాన్ని రద్దు చేయాలని అన్నారు.నిబంధనలకు విరుద్ధంగా అధిక మొత్తంలో ఇసుక తవ్వడం వలన భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని,నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా రైజింగ్ కాంట్రాక్టర్లు వ్యవరించడం జరుగుతుందని అన్నారు.ఈ విధనాని రద్దు చేసి ఆదివాసీ ఇసుక సొసైటి లకు జెసిబిలు, ట్రాక్టర్లు లను సబ్సిడీ లలో ఇప్పించాలని అన్నారు.ఈ తుడుందెబ్బ నాయకులు కబ్బక శ్రావన్ కుమార్,కాపుల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: