CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఉరివేసుకుని యువకుడు మృతి.

Share it:

 


గుండాల/ఆళ్ళపల్లి జనవరి 24 (మన్యం మనుగడ) ఆళ్ల పల్లి మండల కేంద్రంలో

 దారం ఆంధ్రయ్య (35) అనే యువకుడు ఉరివేసుకొని మృతి చెందిన ఘటన ఆళ్ళపల్లి మండల కేంద్రము లోని ఎస్సీ కాలనీలో సోమవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రయ్య , తన తల్లిదండ్రులు మృతి చెందడంతో తన చిన్నమ్మ తో పాటు ఉంటూ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసై మతిస్థిమితం కోల్పోయిన ఆంధ్రయ్య గతంలో పలు మార్లు ఆత్మ హత్యకు ప్రయత్నించగా ఆ కాలనీ వాసులు సకాలంలో చూసి కాపాడారు. సోమవారం కాలనీ శివారు ప్రాంతంలో ఓ చింత చెట్టుకు ఉరివేసుకుని ఆత్మ హత్యకు పాల్పడినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఎస్సై సంతోష్ కేసు నమోదు చేసి, మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు

Share it:

TS

Post A Comment: