మన్యం న్యూస్ వెబ్ డెస్క్:
జెడి పౌండేషన్ కీలక సభ్యుడు, భద్రాచలం పట్టణంలో సుపరిచితుడు,సమాజ సేవకుడు శ్రీ కడాలి నాగరాజు కి 2022 సంవత్సరానికి గాను హైదరాబాద్ కి చెందిన CGS వల్లూరి ఫౌండేషన్ వారు సామాజిక సేవ కి గుర్తింపుగా భారత సేవ రత్న అవార్డు ని అందజేశారు. ఈ మేరకు హైదరాబాదులోసుందరయ్య కళా కేంద్రంలో హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ చేతుల మీదగా ప్రముఖుల సమక్షంలో నాగరాజుకి ఈ పురస్కారం అందజేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ జెడి ఫౌండేషన్ తోపాటు భద్రాచలం లో వివిధ స్వచ్ఛంద సంస్థల్లో చురుగ్గా పాల్గొంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న శ్రీ కడాలి నాగరాజు గారి సేవల కు పురస్కారాన్ని అందించినట్లు తెలియజేశారు. ఈ పురస్కారం రావడం పట్ల జేడీ ఫౌండేషన్ కన్వీనర్ మురళి మోహన్ కుమార్ మరియు పౌండేషన్ సభ్యులు ఇతర మిత్రులు అభినందనలు తెలియజేశారు.
Post A Comment: