మన్యం మనుగడ ములుగు.
మహిళల అన్ని సమస్యల పరిష్కారం కోసం ఒన్ స్టాప్ సెంటర్ గా పని చేస్తున్న సఖీ కేంద్ర శాశ్వత సొంత భవనాన్ని నేడు ములుగు జిల్లాలో రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఎంపీ మహబూబాబాద్ మలోత్ కవిత, ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ తో కలిసి ప్రారంభించారు. 49 లక్షల రూపాయలతో నిర్మించిన ఈ భవనంలో మహిళలకు అత్యవసర పునరావాసం కోసం గదులు, పోలీస్ సాయం, న్యాయ సాయం, వైద్య సాయం వంటి అన్ని వసతులు ఈ భవనంలో ఉంటాయని చెప్పారు.
దీంతో పాటు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని గ్రామీణ రవాణా సదుపాయం పథకం(రూరల్ ట్రాన్స్పోర్టేషన్ స్కీం) కింద కోటి రూపాయల విలువైన 10 రవాణా వాహనాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
అనంతరం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పోస్టర్ ను, మహిళా హెల్ప్ లైన్ 181 పోస్టర్ను ఆవిష్కరించారు. అంగన్వాడిలకు చీరలు పంపిణీ చేశారు.
అక్కడే నిర్మాణం జరుగుతున్న ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ పనులను పరిశీలించారు.
అనంతరం చల్వాయి క్రాస్ రోడ్ నుంచి లక్నవరం వరకు రోడ్డు అభివృద్ధి కోసం కోటిన్నర రూపాయల పనికి శంఖుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రితో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య,జిల్లా పరిషత్తు వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి,
ఏ.పి. ఓ వసంత్ రావు, ఈ.ఈ హేమలత, జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత, జెడ్పీ సీఈవో ప్రసూన,రైతు బంధు జిల్లా అధ్యక్షులు పల్లా బుచ్చయ్య, జెడ్పీటీసీ సఖినాల భవాని,ఎంపిపి గండ్ర కోట శ్రీదేవి సుదీర్, ఎంపీటీసీ, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఇతర అధికారులు, నేతలు ఉన్నారు.
Post A Comment: