- రోగుల బాగోగులు దగ్గరుండి చూసుకుంటున్న విప్ రేగా సతీమణి రేగా సుధారాణి, రేగా యువ సైన్యం
కొత్త దామోదర్ గౌడ్, మన్యం న్యూస్ ప్రతినిధి
మన్యం న్యూస్ :విప్ రేగా మాహ సంకల్పం వందలాదిమంది నిరుపేదలకు కంటి చూపు తెచ్చి పెడుతుంది.ఈ మహా యజ్ఞం విజయవంతం కావడం కోసం రేగా అనుచరులు ,కుటుంబ సభ్యులు విశేష కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం మణుగూరు 100 పడుకల హాస్పిటల్ లో నిర్వహిస్తున్న ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సతీమణి రేగా సుధారాణి పరిశీలించారు. రోగులకంటి పరీక్ష శిబిరం, భోజన వసతి ల వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆమె రోగుల ను ఆత్మీయంగా పలకరించారు.ఈ సందర్భంగా రోగులు సైతం ఆనందం వ్యక్తం చేశారు.తమకు ఓ కన్నా తండ్రి వలె ఎమ్మెల్యే రేగా కాంతారావు తిరిగి కను చూపు ప్రసాదించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రేగా యువ సైన్యం తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: