CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షలుగా ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు నియామకం.హర్షం వ్యక్తం చేస్తూ, శుభాకాంక్షలు తెలిపిన మణుగూరు టిబిజికేయస్ బ్రాంచి ఉపాధ్యక్షులు వూకంటి. ప్రభాకర రావు.

Share it:


మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గాన్ని అభివృద్ధి పధంలో ముందుకు తీసుకువెళ్తు కేసీఆర్ అమలు చేస్తున్న అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు నియోజకవర్గ ప్రజలందరికీ చేరువయ్యే విధంగా,నిరంతరాయంగా కృషి చేస్తున్న ఆదివాసీ బిడ్డ ప్రభుత్వ విప్,పినపాక నియోజకవర్గ శాసన సభ్యులు రేగా కాంతారావు ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తూ,పార్టీ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం పట్ల మణుగూరు టిబిజికేయస్ బ్రాంచి ఉపాధ్యక్షులు వూకంటి. ప్రభాకర రావు హర్షం వ్యక్తం చేశారు.ఆదివాసీ గిరిజనుల్లో పట్టున్న యువ నాయకులు, విద్యావంతుడైన రేగా కు జిల్లా అధ్యక్ష పదవి దక్కడం వల్ల, టిఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం కానున్నదని ఆయన తెలిపారు.జిల్లా రథసారథి గా ఎంపిక కాబడిన రేగా కాంతారావు కు మణుగూరు టిబిజికేయస్ తరుపున బ్రాంచి ఉపాధ్యక్షులు వూకంటి.ప్రభాకర రావు చరవాణి ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

Share it:

TS

Post A Comment: