మన్యం న్యూస్, మణుగూరు:
సారపాక మేడే కాలనీ కి చెందిన బత్తుల రఘువర్మ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న విషయాన్ని రఘువర్మ సోదరుడు (పెదనాన్న కొడుకు) ఓసి -2 లో ప్రైవేటు pvt కన్వినేన్స్ వాహన డ్రైవర్ బత్తుల కోటేశ్వరరావు ద్వారా తెలుసుకున్న ఓసి -2 సింగరేణి అధికారి గునిగంటి కళ్యాణ్ రామ్ (అడిషనల్ మేనేజర్) శుక్రవారం నాడు ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం కోటేశ్వరరావు అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు, అధికారులు భూక్యా భాoగ్యా , జిఎస్ నజీర్ లు మనసున్న మనిషని కళ్యాణ్ రామ్ ను అభినందించారు, ఈ సందర్భంగా రఘు వర్మ సోదరుడు కోటేశ్వరరావు మాట్లాడుతూ తన సోదరుడు రఘువర్మ మణుగూరు లో నివసించే వాడని పీజీ వరకు ఉన్నత విద్యను అభ్యసించాడని ఉద్యోగ వేటలో అలసిపోయి సొంతంగా ఒక ప్రైవేటు కార్ ని ఫైనాన్స్ లో తీసుకుని సారపాక లో నివాసముంటూ కారు నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడని దురదృష్టం రోడ్డు ప్రమాద రూపంలో కాటు వేసిందని ఇప్పటి వరకు సుమారు తొమ్మిది లక్షల రూపాయల వరకు అప్పుచేసి ప్రైవేటు వైద్యశాలలో అత్యవసర వైద్యం చేయించామని తను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడని నిరుపేద కుటుంబం కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని దాతలు తమ తమ్ముడిని ఆదుకోవాలని ఆయన కోరారు, ఈ కార్యక్రమంలో భూక్య భాoగ్యా, జిఎస్ నజీర్, కోటి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: