చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: సుజాతనగర్ నుండి కిష్టారం కూలి పనుల నిమిత్తం వెళ్తూ ఉండగా తిప్పనపల్లి గ్రామం వద్ద అటుగా వేగంతో బొగ్గు టిప్పర్ ఢీకొట్టడంతో ఆటో ట్రాలీ ఉన్న కూలీలు కత్తి స్వాతి 26, కొక్కిరాల సుజాత 45,ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. గుర్రం లక్ష్మి 52, కత్తి సాయమ్మ 40 ఇద్దరు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందారు. ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.సంఘటనా స్థలం వద్ద మృతుల బంధువులు మృతదేహంతో రాస్తారోకో చేశారు. తిప్పనపల్లి గ్రామస్తులు కూడా బొగ్గు టిప్పర్లు వేగాన్ని నియంత్రించాలని గ్రామస్తులు రాస్తారోకో చేశారు. సంఘటనా స్థలానికి చంద్రుగొండ సిఐ నాగరాజు పోలీస్ సిబ్బంది మరియు కొత్తగూడెం పోలీస్ సిబ్బందితో గ్రామస్తులకు నచ్చజెప్పి ట్రాఫిక్ను క్లియర్ చేశారు.
Post A Comment: