మన్యం మనుగడ కరకగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ పట్టణంలో జరిగిన రామకృష్ణ కుటుంబం మృతి ఘటనపై ప్రభుత్వం, పోలీసులు సమగ్ర విచారణ జరిపించాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొమరం కాంతారావు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనమా ఎమ్మెల్యే కాలం నుంచి నేటి వరకు జరిగిన తన కొడుకు దురాగతాలు దుర్మార్గాలపై పూర్తి సమగ్ర విచారణ జరిపించి ఎమ్మెల్యే కొడుకును శిక్షించాలని అన్నారు.
కేవలం అరెస్టు చేయడమే కాకుండా కేసులన్నీ విచారణ జరిగేదాకా బెయిల్ ఇవ్వకుండా చూడాలని ఆయన పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే కొడుకు చేసిన అన్యాయాలు, అక్రమాలకు బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు రాజీనామా చేయాలని ఆ దుర్మార్గాలు అన్నిటికీ అండగా నిలిచిన ఎమ్మెల్యే కూడా బాధ్యుడని అన్నారు.రామకృష్ణ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని రామకృష్ణ మృతికి సంబంధించిన అన్ని కోణాలను శోధించి బాధ్యులైన అందరినీ కటినంగా శిక్షించాలని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే కొడుకుని నియోజకవర్గ బహిష్కరణ చేయడం కాదు మానవ బహిష్కరణ చేయడమే సరైన మార్గమని ఆయన తెలిపారు. ఈ పోరాటంలో అరెస్టు చేసిన అఖిలపక్ష నాయకులు తక్షణమే విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో చర్ప సత్యం, తాటి సతీష్ పార్టీ నాయకులు పాల్గొన్నారు
Post A Comment: