మన్యంటీవి, అశ్వారావుపేట:మండల పరిధిలోని కన్నాయిగూడెం అంగన్వాడి కేంద్రాన్ని హైదరాబాద్ కు చెందిన ఇక్రిశాట్ టీమ్ సందర్శించడం జరిగింది. గిరి పోషణలో భాగంగా మండలంలోని పలు అంగన్వాడీ కేంద్రాలు సందర్శించేందుకు మండలానికి వచ్చిన ఇక్రిశాట్ టీం కన్నాయిగూడెం అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ సిడిపిఓ రోజా రాణి, కన్నాయిగూడెం సర్పంచ్ లక్ష్మణ్ రావు, ఇక్రిశాట్ ప్రతినిధులు హర్షవర్ధన్, రాజశేఖర్, అంగన్వాడి సూపర్వైజర్, పద్మావతి, అంగన్వాడీ టీచర్ చిట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: