CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలి--:సీపీఐ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి తోట మల్లికార్జున్ రావు.

Share it:


మన్యం మనుగడ ఏటూరు నాగారం

అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి తోట మల్లి కార్జున్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని అనేక ఏజెన్సీ మారుమూల గ్రామాల్లో వేలాది ఎకరాలల్లోని మొక్కజొన్న,మిర్చి,పత్తి,అరటి పంటలు దెబ్బతిన్నాయని, బీర,కాకర,బెండ,టమోటో లాంటి కూరగాయల పంటలు ధ్వంసమమై,రైతులకష్టం నీటిపాలయిందని అన్నారు. వర్షాల వల్ల దెబ్బతిని నష్టపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏటూరు నాగారం మండల కార్యదర్శి ఎండి నాసార్ అధ్యక్షతన జరిగిన.ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంనికి సిపిఐ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి తోట మల్లికార్జున్ రావు ముఖ్య అతిధి గా హాజరై మాట్లాడుతూ..పాలక ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైన ఈ పరిస్థితుల్లో అకాల వర్షాలు రైతులను నడ్డివిరిచాయని ఆవేదన వ్యక్తం చేశారు.దెబ్బ తిన్న పంటలను సర్వే చేసి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు నాసర్,బట్ట కోమరయ్య, సత్యనారాయణ,బనారి సీతమ్మ తదితర నాయకులు, పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: