మన్యం టీవీ న్యూస్ : జూలూపాడు, జనవరి 28, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం కొత్తూరు గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్ద హరిజనవాడ గ్రామానికి చెందిన గార్లపాటి సర్వేష్ (17) అనే విద్యార్థి ఊరి చివర లో ఉన్న కూసికుంట చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే మండల పరిధిలోని పెద్దహరిజనవాడ గ్రామానికి చెందిన గార్లపాటి యేసు, నర్సమ్మ దంపతులకు ఇద్దరు కుమ్మరులు పెద్ద కుమారుడు ఖమ్మం సివిరామన్ కాలేజీలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కరోనా కారణంగా ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో ఇంటిదగ్గరే ఉంటున్నాడు. ఎప్పుడు చూసినా సెల్ఫోన్ తోనే కాలక్షేపం చేస్తూ ఉండడంతో గురువారం తల్లిదండ్రులు మందలించడంతో అలిగి ఇంటి నుండి వెళ్ళిపోయాడు. శుక్రవారం ఊరి చివర ఉన్న చెరువులో శవమై తేలాడు. గ్రామస్థులు మృత దేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న జూలూరుపాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాన్ని వెలికి తీసి పోస్టుమటనికి తరలించి, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Post A Comment: