మన్యం మనుగడ , పినపాక:
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా, పినపాక మండల వ్యాప్తంగా రైతుబంధు వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏడూళ్ల బయ్యారం వ్యవసాయ విస్తరణ అధికారి కొమరం లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో గురువారం బయ్యారం గ్రామంలో ఇంటింటికి రైతుబంధు కార్యక్రమం నిర్వహించారు. బయ్యారం గ్రామానికి చెందిన రైతు బంధు లబ్ధిదారురాలు వెన్న రేణుక ఇంటి ఆవరణలో, డ్వాక్రా మహిళలు ముగ్గులు వేసి రైతుబంధు ఆవశ్యకతను తెలియజేశారు. అనంతరం వ్యవసాయ విస్తరణ అధికారి కొమరం లక్ష్మణరావు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా రైతుబంధు వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల పదవ తారీకు వరకు అన్ని గ్రామాల్లో రైతుబంధు వారోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. గ్రామంలోని రైతులందరూ రైతు బంధు, రైతు బీమా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐకెపి సాలయ్య, డ్వాక్రా మహిళలు తోకల రమాదేవి, బత్తుల మంజుల, కొరస పద్మ, ఎక్కంటి వీరలక్ష్మి, స్థానిక రైతులు లక్ష్మణరావు, గీద కొండయ్య,మహిళలు కమల కుమారి, గుండ్ల
Post A Comment: