- జానంపేట లో రైతు బంధు పై హర్షం వ్యక్తం చేస్తూ ముగ్గులువేసిన మహిళ రైతులు
- జానంపేట లో పాల్గొన్న ఆత్మ చైర్మన్ పోనుగోటి భద్రయ్య,పి ఏ సీఎస్ చైర్మన్ రవిశేఖర వర్మ
మన్యం మనుగడ, పినపాక :
తెలంగాణ ఆత్మ బంధువు, రైతన్నల రైతు బంధువు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేస్తున్న సేవలను కొనియాడుతూ రైతన్నలు రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా ఎవరికి వారే సంక్రాంతి పండగ సమయాన్ని పురస్కరించుకొని ఇంటి ముంగిట సంక్రాంతి ముగ్గుల కు బదులు రైతుబంధు ముగ్గులు వేస్తున్నారు. పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే నియోజకవర్గంలోని రైతన్నల పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ, రైతుబంధు ప్రతి ఒక్క రైతుకు వచ్చే విధంగా వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి వారి జీవితాలలో ఆనందాన్ని నింపుతున్నాడు. దానికి ప్రతిఫలంగా రైతన్నల ఇంటి ముంగిట జై కేసీఆర్ జై జై రేగన్న అని రాస్తూ, రైతుబంధు విశిష్టత గురించి చాటుతున్నారు. నియోజకవర్గంలోని చాలా గ్రామాలలోని రైతులు, కేసిఆర్ చేసే కార్యక్రమాల గురించి చర్చించుకుంటున్నారు. పినపాక నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రవివర్మ తో కలసి తన ఇంటి వద్ద రైతుబంధు గొప్పతనాన్ని చాటే విధంగా ముగ్గులు వేయించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాటలను తు.చ తప్పకుండా పాటిస్తూ తోగ్గూడెం ఎంపీటీసీ చింతపంటి సత్యం, పినపాక సర్పంచ్ గొగ్గల నాగేశ్వరరావులు రైతుబంధు ముగ్గులు వేయించారు. సంక్రాంతి పండుగను త్వరలో సంతోషంగా చేసుకోబోతున్నండుకు, రైతుబంధు ఖాతాలో పడినందుకు రైతులు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.
Post A Comment: