CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కేసిఆర్ రైతును రాజు చేశాడు.రైతులకు రూ.50వేల కోట్ల రైతుబంధు ఇచ్చి ఆదుకున్న దేవుడు

Share it:

 





 సంతోషం వ్యక్తం చేసిన ఎంపీటీసీ చింతపంటి సత్యం, సర్పంచ్ గొగ్గల నాగేశ్వరరావు


పినపాక లో రైతు బంధు సంబురాలు


మన్యం మనుగడ,పినపాక: 


రైతును రాజు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని తోగ్గూడెం ఎంపీటీసీ చింతపండు సత్యం, పినపాక సర్పంచ్ నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు శుక్రవారం పినపాక మండల కేంద్రంలో వారి ఆధ్వర్యంలో రైతుబంధు సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు రైతుబంధు ముగ్గులు వేసి ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్ పి టి సి చింతపండు సత్యం మాట్లాడుతూ, రైతుకు పంట పెట్టుబడులకు రెండు సీజన్ లకు రైతుబంధు ఇచ్చి దేవుడయారన్నారు.రైతు ఆత్మహత్యలు లేని తెలంగాణ రాష్ట్రం టిఆర్ఎస్ ప్రభుత్వం తోనే సాధ్యమని ఆయన అన్నారు. రైతులకు ఏ కష్టాలు రాకుండా సకాలంలో ఎరువులు, విత్తనాలు అందజేయడంతో పాటు నకిలీ విత్తనదార్ల ఆటలు అరికట్టడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉక్కుపాదం మోపారని, ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం మరింత ప్రగతిలో నడవాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సాధ్యం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు షేరు రామయ్య, షేరు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: