మన్యం మనుగడ మంగపేట.
మంగపేట మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల ఆవరణంలో ఆదివారం రోజున వాయిద్య కళాకారులు నూతన కమిటీ ఎన్నిక జాడి ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది, ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వాయిద్య కళాకారులు సంఘం జిల్లా అధ్యక్షులు ఎండి అంకుష్, కార్యదర్శి ఎండి సుకూర్ ఈ సమావేశానికి హాజరైనారు.సుకూర్ మాట్లాడుతూ వాయిద్య (బ్యాండ్ బాజా) కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత అందించి వాయిద్య కళాకారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు, అనంతరం నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు,
వాయిద్య కళాకారుల సంఘం అధ్యక్షుడిగా మారబోయిన గోవర్ధన్, కార్యదర్శి రామటెంక సందీప్ ,ఉపాధ్యక్షులు మనుబోతు లక్ష్మణ్ ,కోశాధికారి యాసం రవి, కమిటీ సభ్యులు సత్యం, నవీన్, చంద్రయ్య, ప్రవీణ్ ,సీతారాం, నరేష్ ,సుదర్శన్ ,శ్రీను, సతీష్, చిట్యాల రాములు తదితరులు 50 మంది వరకు బ్యాండ్ కళాకారులు పాల్గొన్నారు.
Post A Comment: