మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, మల్లాయిగూడెం గ్రామ పంచాయతీ దిబ్బగూడెం గ్రామం లో సర్పంచ్ నారం రాజశేఖర్ ఆధ్వర్యంలో రైతులు వారు పొందిన రైతుబంధు పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ, రైతుల పక్షాన నిలబడి రైతుబంధు అందజేయడం, తెలంగాణ ప్రభుత్వానికే సాధ్యపడిందని, ఆనందం వ్యక్తం చేశారు. వేసే పంటకు పెట్టుబడిగా రైతుబంధును తెలంగాణ ప్రభుత్వం అందించడం చాలా సంతోషంగా ఉందని సర్పంచ్ నారం రాజశేఖర్ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా, రైతుల పక్షాన నిలబడే రైతు బంధువుగా కేసిఆర్ వుండడం ఆనందకరమని రైతులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నారం రాజశేఖర్, మల్లాయిగూడెం టిఆర్ స్ పార్టీ గ్రామ కమిటీ విద్యార్థి విభాగం కార్యదర్శి నారం నరసింహరావు, రాముడు,ఆకాష్ రావు, సుధాకర్, మొడియం దుర్గారావు, తాటి వెంకటేష్, సోరేం సుశీల, కృష్ణ వేణి, గ్రామ రైతులు, గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: