మన్యంటీవి, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం బచ్చువారిగూడెం గ్రామ పంచాయతీలో ప్రభుత్వ ఆశ్రమ గిరిజన పెద్దవాగు ప్రాజెక్ట్ పాఠశాలను బిసి వెల్ఫేర్ కు అప్పగించే విషయం పై అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావుకి దమ్మపేట మండలం తాటిసుబ్బన్నగుడెం గ్రామం లో వారి నివాసంలో వినతి పత్రాన్ని అశ్వారావుపేట మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు మల్లాయిగుడెం సర్పంచ్ నారం రాజశేఖర్ అద్వర్యంలో నారాయణపురం సర్పంచ్ కంగాల పరమెష్, కుంజ రాము, బచ్చువారిగుడెం పిసా కమిటీ అధ్యక్షులు జెట్టి బన్ను, జెట్టి వెంకటేశ్వర్లు, జెట్టి లక్ష్మణరావులు అందించారు. ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన ఎంఎల్ఎ మెచ్చా పీవోతో మాట్లాడుతానని ఎలాంటి దిగులు చెందవద్దని తెలిపారు. అనంతరం సర్పంచ్ నారం రాజశేఖర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ ప్రభుత్వ విఫ్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావుకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఐటిడిఎ పిఓతో, కలెక్టర్ తో మాట్లాడుతాను మీరేం కంగారుపడొద్దని హామీ ఇవ్వడం జరిగింది.
Post A Comment: