మన్యం టీవి, గుండాల:
పోడు భూముల రక్షణ కొరకు ప్రజల ఐక్యంగా ఉద్యమించాలని సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు గుండాల ఎం.పి.పి ముక్తి సత్యం,డివిజన్ సహాయ కార్యదర్శి తుపాకులు నాగేశ్వర్ రావు అన్నారు.
ఈరోజు ఆదివారం పోలారంలో పార్టీ మండల నాయకులు చింత ఉదయ్ అధ్యక్షతన నిర్వహించిన పోడు రైతుల జనరల్ బాడీ జరిగింది.ఈ జనరల్ బాడీలో వారు ప్రసంగింస్తూ... హరితహారం పేరుతో పోడు భూముల్లో మొక్కలు వేయడం నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోడు భూములకు పట్టాలు ఇస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి హామీ ఇచ్చి ఇంతవరకూ ఏ ఒక్కరికి పట్టాలి ఇవ్వలేదని, అనేక ఏళ్లుగా సాగుచేసుకుంటున్న పోడు భూములు అక్రమంగా గుంజుకుని ట్రెంచిలు కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి స్పందించి అనేక ఏళ్లుగా ఆదివాసీలు, గిరిజనులు పేదలు సాగుచేసుకుంటున్న పోడుభూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు.అలాగే ఫారెస్ట్ వారి దోపిడీ దౌర్జన్యాలను నిలుపుదల చేయాలని, పోడు సాగు దారులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి పొడుగు నరసింహారావు, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కుక్కు సారంగపాణి, టేకులపల్లి మండలం నాయకులు ఎట్టి నరసింహారావు, పోలారం సర్పంచ్ వాంకుడోత్ సరోజిని, పీ.వై.ఎల్ జిల్లా అధ్యక్షులు చింత నరసింహారావు, నాయకులు భూక్య మంగ్య దేవుజ్య, గొగ్గేల రాజు, హార్జ్య, విజయ్, పోడుసాగుదారులు,ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: