- సెల్ ఫోన్ మాట్లాడుతూ...డ్రైవింగ్ చెయ్యడమే ప్రమాదానికి కారణమా?
మన్యం టీవి న్యూస్,అశ్వాపురం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం లో కొత్తగూడెం కి చెందిన ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు.స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
కొత్తగూడెం కు చెందిన రుక్మన్ (28 )అనే వ్యక్తి మణుగూరులో తన బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా మొండికుంట సమీపంలో శనివారం కారు కు ప్రమాదం చోటుచేసుకుంది.ఈ క్రమంలో ప్రధాన రహదారిపై ఉన్న మైలు రాయి ని కారు వేగంగా ఢీ కొట్టి ,పక్కనే ఉన్న చెట్టును మరల బలంగా ఢీ కొట్టడంతో రుక్మన్ గాయపడ్డాడు.అది గమనించిన అటువైపు గా వెళ్లే వాహన చోదకులు రుక్మన్ కి సపర్యలు చేసే క్రమంలో మృతి చెందాడు.సెల్ ఫోన్ మాట్లాడుతూ...డ్రైవింగ్ చెయ్యడమే ప్రమాదానికి కారణమా?అని పలువురు చర్చించుకుంటున్నారు.మృతి దేహాన్ని రుక్మన్ కొత్త గూడెం కి తరలించారు.
Post A Comment: