మన్యం టీవి న్యూస్,పినపాక: వందరోజుల పని లో గాయపడిన పినపాక మండలం బోటి గూడెం గ్రామానికి చెందిన శర్ప రుక్మిణి కుటుంబాన్ని వి జి యస్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఆదుకోవాలని సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి మోర రవి కోరారు. శనివారం బోటిగూడెం గ్రామంలో గాయపడిన మహిళ నివాసానికి వెళ్లి పరామర్శించారు గత ఐదు రోజుల క్రితం వందరోజుల పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు పలుగు చేతి వేలిపై దిగి వేలు పూర్తిగా విరిగిపోయిందని అన్నారు. వెంటనే పంచాయతీ సెక్రెటరీ కి సమాచారం అందించి పినపాక ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లగా ఇక్కడ చికిత్స చేయడం కుదరదని చెప్పడంతో తోడుగా వచ్చిన తోటి పని వారందరూ ఇళ్లకు వెళ్లిపోగా మరో మహిళను తోడుగా తీసుకుని గాయపడిన ఆదివాసి మహిళ ఏం చేయాలో తెలియక గొందిగూడెం లో వారి బంధువుల ద్వారా 20 వేలు అప్పు చేసి భద్రాచలంలో ఒక ప్రైవేటు వైద్యశాలలో వైద్యం చేయించుకోవడం జరిగిందని తెలిపారు. గాయ పడిన తర్వాత విషయం తెలిసినప్పటికీ, గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులు ఎవరు పట్టించుకోకపోవడం ఏమిటని? ప్రశ్నించారు. వెంటనే ఉపాధి హామీ పథకంలో పేర్కొన్న విధంగా గాయపడిన మహిళ పూర్తి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలని, వైద్యం జరిగేటప్పుడు వసతి సౌకర్యాలు కల్పించాలని, అలాగే భత్యం కింద 50 శాతం వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇకనుండైనా పనిప్రదేశాల్లో ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేశారు. పరామర్శించిన వారిలో ఇర్ప ఆనందరాజు, దుర్గం శ్రీను, శర్ప ప్రవీణ్ పాల్గొన్నారు.
Navigation
Post A Comment: