CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కరోనా బాధిత కుటుంబానికి నిత్యావసరాల పంపిణీ చేసిన ఎంపీటీసీ చింతపంటి సత్యం, సర్పంచ్ నాగేశ్వరరావు

Share it:

 



మన్యం మనుగడ, పినపాక: 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పినపాక గ్రామంలో తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాలతో కరోనా బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులను తోగ్గూడెం ఎంపీటీసీ చింతపంటి సత్యం, పినపాక సర్పంచ్ గొగ్గల నాగేశ్వరరావు అందించారు.

 పినపాక మండల కేంద్రానికి చెందిన ఓ కుటుంబం కరోనా భారిన పడింది.విప్ ,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాలతో, వీరు ఇరువురు ఆర్ధిక వితరణ తో పాటు బాధిత కుటుంబానికి 10 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేసి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ, మాయదారి కరోనా ముప్పు అధికంగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలందరూ భౌతిక దూరం పాటించాలని, చేతులను శుభ్రంగా చేసుకోవాలని, మాస్క్ లు తప్పక ధరించాలి అని వారన్నారు. ఎవరికైనా దగ్గు , జలుబు లాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే తక్షణమే ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవాలని కోరారు. అలాగే వైరస్ బారిన పడిన వారు తప్పకుండా హోమ్ క్వారంటైన్ పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు సోంపల్లి తిరుపతి, నాయకులు సురేష్ , టిఆర్ఎస్వి నాయకులు సాయి కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: