మన్యం మనుగడ, పినపాక:
శ్రీమతి ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు పినపాక మండలం లోని ఏడూళ్ల బయ్యారం ఎక్స్ రోడ్ కాంగ్రెస్ పార్టీకార్యాలయం లో మండల అధ్యక్షుడు గొడిశాల రామనాథం ఆధ్వర్యంలో బుధవారం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా గొడిశాల రామనాథం మాట్లాడుతూ... రాబోయే 2003 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్ర, రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.2018 ఎన్నికల్లో పినపాక నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ 20 వేల మెజారిటీ నీ సాధించిన విషయం అందరికీ తెలిసిందే కానీ 2023 సంవత్సరం ఎన్నికల్లో 40 వేల మెజారిటీతో గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టికెట్ ఎవరికి వచ్చినా ప్రతి కార్యకర్త మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ కి ఓట్లు వేస్తారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గీద సాయి, మండల ఎస్సీసెల్ నాయకుడు జాడి రాంబాబు, గట్ల శ్రీనివాస్ రెడ్డి, మండల కమిటీ సభ్యుడు పూనేం వెంకటేష్, పోనుగోటి చందర్రావు, జరుపుల రాము, బత్తుల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: