మన్యం మనుగడ మంగపేట.
మంగపేట మండలం త్యోండాల గ్రామంలో ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో 30 మంది పేద గిరిజన కుటుంబాలకు యూత్ ఫర్ సేవా మరియు ధర్మ జాగరణ సమితి సంయుక్తంగా నిత్యావసర సరుకులు పంపిణి జరిగింది.
ఈ కార్యక్రమ ముఖ్య అతిధి సేవాభారతి ములుగు జిల్లా ప్రముఖ్ గోల్ల కుమార్ మాట్లాడుతూ కరోనా సమయంలో దేశం కష్టాల నుండి భయట పడిందని,థర్డ్ వేవ్ ఓమిక్రాన్ వేరియంట్ రూపంలో
వచ్చే అవకాశాలు ఉన్నందున అందరూ మంచి పౌష్టిక ఆహారం తీసుకోవాలని,
ఆరోగ్యవంతమైన వాతవరణం కోసం పరిసరాలను శుభ్రంగా ఉంచుకోని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సేవాభారతి ఏటూరునాగారం ఖండ ప్రముఖ్ ఇప్పలపెళ్ళి రమేష్,తుడుందెబ్బ నాయకులు కబ్బాక శ్రావణ్,సేవా భారతి కార్యకర్తలు జబ్బ సమ్మయ్య,పోదేం రవిందర్,
చీకట్ల యాకస్వామి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: