చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: మండల పరిధిలోని తిప్పనపల్లి గ్రామంలో ఇంటి ముందు ఆపి ఉంచిన ఆటో చోరీకి గురైన సంఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది. బాధితుని కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... తిప్పనపల్లి గ్రామానికి చెందిన షేక్ ముస్తాఫా తనకు గల ఆటో( ఆటో నెంబర్: టీఎస్ 04 యుబి 0588)ను తన ఇంటి ఎదురుగా ఉంచి శనివారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఆదివారం ఉదయం చోరీ జరిగిన విషయాన్ని గమనించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ బి.రాజేష్ కుమార్ దర్యాప్తును చేపట్టారు.
Post A Comment: