CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సభ్యత్వ నమోదుపై దృష్టి సారించండి.సభ్యత్వం తీసుకున్న వారికి రెండు లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది..

Share it:



  • కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయముతో పని చేయాలి.
  • మంగపేట మండల ఎన్రొలర్లు గట్టి పెల్లి బాబు,బాబులను శాలువా తో సన్మనించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. 

మన్యం మనుగడ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు తీరును పరిశీలించిన సభ్యత్వ నమోదు ఇంచార్జీ కూచన రవళి రెడ్డి,కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి.ఈ సందర్భంగా మాట్లాడుతూ.కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయము తో పని చేయాలని 35 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాద భీమా 2 లక్షలు వర్తిస్తుంది దీనిని ప్రజల్లోకి తీసుకు వెళ్ళి మనకు ఇచ్చిన గడువు లోపు సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని ప్రతి బూత్ నుండి కనీసం 150 సభ్యత్వాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన వారిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుందినీ వారు అన్నారు.కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కెసిఆర్ నియంతృత్వ పోకడలతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన పరిస్థితి ఉందని తెలంగాణ వస్తే మా బ్రతుకులు మారుతాయి మా బాధలు తీరుతాయి అని నమ్మిన రాష్ట్ర ప్రజలకు కెసిఆర్ చేసింది ఏమి లేదని ఏక కాలంలో రైతు రుణ మాఫీ అన్నాడు చెయ్యలే 

దళితులకు మూడెకరాల భూమి అన్నాడు.ఇవ్వాళే

పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తా అన్నాడు ఇవ్వాళే

పేదలకు డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తా అన్నాడు ఇవ్వాళే

పోడు భూములకు పట్టాలు ఇస్తా అన్నాడు ఇవ్వక పోగా హరిత హరం పేరుతో ఉన్న భూములు గుంజుకున్నడు 

ఇలా అనేక హామీల తో గద్దెనెక్కిన కెసిఆర్ రాష్ట్ర ప్రజలను మోసం చేశాడని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నీ అధికారంలోకి తీసుకు వచ్చే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త పని చేయాలని కెసిఆర్ మాయ మాటలు ప్రజలలోకి తీసుకుపోయే విధంగా కార్యకర్తలు పని చేయాలని వారు పిలుపు నిచ్చారు.సభ్యత్వ నమోదు లో టెక్నికల్ సమస్య ఉన్న చో ఈ నెంబర్ ను సంప్రదించాలని 

మణి వర్మ 8465853375 ఎన్రోలర్లు ఫోన్ చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్,ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య,జడ్పిటిసి నామా కరం చంద్ గాంధీ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుస వడ్ల వెంకన్న,మండల అధ్యక్షులు చిటమట రఘు,మైల జయరాం రెడ్డి,సభ్యత్వ నమోదు ఇంఛార్జిలు పూజారి సురేందర్ బాబు,చవులం వెంకటే శ్వర్లు,ములుగు ఎంపీటీసీ

మవురపు తిరుపతి రెడ్డి,

సహకార సంఘం వైస్ చైర్మన్ చెన్నురి బాలరాజు,పట్టణ అధ్యక్షుడు తాళ్ళ పెల్లి నరేందర్ గౌడ్,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ గౌస్,ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు చేల వినయ్,

మంగపేట మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు మల్లయ్య,

సీనియర్ నాయకులు విసం వీరయ్య,మండల ఉపాధ్య క్షులు తూడిబాగ్ వాన్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ మండల కార్యదర్శి ఎండి సర్దార్,ప్రవీణ్,సారయ్య

శ్రీకాంత్,అర్జున్,బాబు,

రాంబాబు,శ్రీనివాస్,తోట అశోక్,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: