మన్యం మనుగడ కరకగూడెం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం వీరాపురం గ్రామానికి చెందిన తెరాస నాయకులు పూనెం బుచ్చయ్య తండ్రి పూనెం పిచ్చయ్య అనారోగ్యం తో కొన్ని రోజుల క్రితం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు వీరాపురం గ్రామం పూనెం పిచ్చయ్య నివాసానికి వెళ్ళి అతని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మృతుడి కుమారుడు తెరాస నాయకులు పూనెం బుచ్చయ్య ను పరామర్శించి మనోధైర్యాన్ని చెప్పి ఇటువంటి సమయంలో ధైర్యం గా ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు వ్యవసాయ కమిటీ ఉపాధ్యక్షుడు కొమరం రాంబాబు, మండల అధ్యక్షులు రావుల సోమయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: