గుండాల జనవరి 12( మన్యం మనుగడ) దామర తో గు పంచాయతీ లో గల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కు ప్రత్యేక ధన్యవాదాలు అని టిఆర్ఎస్ పార్టీ నాయకులు సుతారి సత్యం పేర్కొన్నారు. బుధవారం మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రేగాను కలిసి డబల్ బెడ్ రూమ్ ల కోసం నిధులు మంజూరు చేయాలని దానితోపాటు గుండాల రంగాపురం రహదారికి అటవీశాఖ అనుమతులు త్వరగా ఇప్పించాలని కోరామన్నారు. ముఖ్యంగా పంచాయతీ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరామన్నారు. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ విప్ రేగా తక్షణమే సి సి రోడ్డు నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలను మంజూరు చేశారన్నారు. డబల్ బెడ్ రూమ్ నిధులు మార్చిలోపు అందుతాయని అటవీశాఖ అనుమతులు కూడా త్వరలోనే వస్తాయని హామీ ఇచ్చారన్నారు. ఈ సమావేశంలో ఉకే సమ్మయ్య పాల్గొన్నారు
Post A Comment: