పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ
మన్యం మనుగడ, పినపాక:
కరోనా ప్రమాదం పొంచి ఉన్నందున ప్రజానీకం ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని పినపాక మండలం ఎంపీపీ గుమ్మడి గాంధీ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఒమిక్రాన్ రూపంలో ప్రమాదం పొంచి ఉందని, ప్రతి ఒక్కరూ శానిటైజర్, మాస్కు తప్పనిసరిగా వాడాలని, స్వీయ నియంత్రణ నివారణ మార్గమని ఎంపీపీ గుమ్మడి గాంధీ తెలియజేశారు. మండల ప్రజలు కరోనాకు దూరంగా ఉండి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. 15 నుండి 18 సంవత్సరాల వయసుగల విద్యార్థినీ విద్యార్థులకు కరోనా టీకాలు వేయడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు.
Post A Comment: